సంగీతం: మణిశర్మ
గానం: హేమచంద్ర
మరుమల్లెల వానా .. మృదువైన .. నా చెలి పైనా
విరిసిన నవ్వుల్లో .. ముత్యాలే .. పోగేస్తున్నా
తారకవి ఎన్ని తళుకులో .. చాలవే రెండు కన్నులూ
మురిసినవి ఎన్ని మెరుపులో .. చూసి తనలోని వంపులూ
లాగి నన్ను కొడుతున్నా .. లాలిపాడినట్టుందే .. విసుగురాదు ఏమన్నా .. చంటిపాపనా !
మరుమల్లెల వానా .. మృదువైన .. నా చెలి పైనా
విరిసిన నవ్వుల్లో .. ముత్యాలే .. పోగేస్తున్నా
జక్కన .. చెక్కిన .. శిల్పమే ఇక కనపడదే
చైత్రము .. ఈ గ్రీష్మము ..నిను చూడగా సెలవడిగెనులే
సృష్ఠిలో .. అద్బుతం .. నువ్వే కదా కాదనగలరా
నిమిషానికే క్షణాలను .. ఓ లక్షగా మార్చెయమనరా
అలనాటి యుద్దాలే జరుగుతాయేమో ..
నీలాంటి అందాన్నే తట్టుకోలేరేమో..
శ్రీరాముడే శ్రీకృష్ణుడై మారేంతలా !
ఆయువై.. నువు ఆశవై .. ఓ ఘోషవై ఇక వినపడవా
ప్రతి రాతిరీ .. నువు రేపటి .. ఓ రూపమై చెలి కనపడవా
తీయని .. ఈ హాయిని .. నేనేమనీ ఇక అనగలనూ
ధన్యోశ్మని .. ఈ జన్మని .. నీకంకితం ముడిపడగలనూ
మనువాడమన్నారు సప్తఋషులంతా
కొనియాడుతున్నారు అష్టకవులే అంతా
తారాగణం .. మనమే అని .. తెలిసిందెలా
మరుమల్లెల వానా .. మృదువైన .. నా చెలి పైనా
విరిసిన నవ్వుల్లో .. ముత్యాలే .. పోగేస్తున్నా
తారకవి ఎన్ని తళుకులో .. చాలవే రెండు కన్నులూ
మురిసినవి ఎన్ని మెరుపులో .. చూసి తనలోని వంపులూ
లాగి నన్ను కొడుతున్నా .. లాలిపాడినట్టుందే .. విసుగురాదు ఏమన్నా .. చంటిపాపనా !
No comments:
Post a Comment